Holi Festival
Full Review
ఇకపోతే ఫాల్గుణ పౌర్ణిమనాడు ఒకరి పైన
ఒకరు రంగులు చల్లు కోనే ఆనవాయతి ఎలా వచ్చిందంటే ...
శ్రీ కృష్ణుడు నల్లని వాడు. రాధ పాల మిగడలా తెల్లని తెలుపుతో ఉంటుంది. ఓ రోజున శ్రీ కృష్ణుడు రాధ పక్కన కుర్ఉచుని ఉన్న సమయాన తనని తాను చూసుకుని తాను ఎందుకు నల్లగా సున్నానా అని దిగులు పడ్డాడట.
అప్పుడు యశోదమ్మ ఒక ఉపాయం చెప్పిందట. ‘రాధ అసలు రంగు తెలియకుండా ఉండడానికి ఆమె పైన అన్ని రంగులు కలిపిన నీళ్లు పోయ మని చెప్పిందట. దాంతో నల్లనయ్య రాధమీద రంగునీళ్లు పోశాడట.
ఈహఠాత్పరిణామానికి విస్తుపోయిన రాధ తను కూడా కృష్ణుని మీద రంగులు కలిపిన నీరు చిలకరించిందట. ఇలా రాధాకృష్ణులిద్దరూ ఒకరి మీద ఒకరు రంగునీళ్లు పోసుకోవడం చూసిన ద్వారక జనులు తాము కూడా ఆనందోత్సాహాలతో ఒకరిపైన ఒకరు రంగులు పోసుకోవడం చేసారట.
అదే మనకి రంగుల పండుగ అయింది.
ఆ నాటినుంచి ప్రతి ఫాల్గుణ పున్నమినాడు ప్రజలందరూ ఒకరినొకరు రంగులతో
ముంచెత్తుకోవడం, పెద్ద ఎత్తున పండుగలా జరుపుకోవడం
ఆనవాయితీగా మారిపోయింది.
ఇకపోతే ఇపుడు ఒక్కో ప్రాంతాలల్లో ఒక్కో విదంగా ఈ పండుగను జరుపుకుంటున్నారు. హోలీ అని పేరు రావడానికి కారణం హిరణ్య కశిపునికి హోలిక అనే సోదరి ఉండేదట. హోలిక తన మేనల్లుడైన ప్రహ్లాదుణ్ణి చంపాలని అతన్ని తన ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్నిలో దూకిందట. అయితే, హోలిక మంటల్లో మాడిపోగా, ప్రహ్లాదుడు నారాయణ ప్మంత్రాన్ని జపిస్తూ సురక్షితంగా బయట పడ్డాడు. ఆ దుష్ట రాక్షసి పీడ వదిలిందన్న సంతోషంతో మధుర లోని ప్రజలంతా ఆనందంతో ఒకరిపై ఒకరు రంగు నీళ్లు చల్లు కుంటూ హోలీ అనే ఉత్సవం చేసుకున్నారట. హోలిక అనే రాక్షసి అంతం అవ్వడం తో ఆమె పేరు మీదుగా కూడా ‘హోలీ’ అనే పేరు వచ్చిందట, ఇవే కాకుండా హోలీ పండుగను వసంత రుతువు వస్తోందనడానికి సంకేతంగా భావిస్తారు. ఈ వేళ లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తే సకల సంపదలూ చేకూరతాయని పురాణమ్ లో చెప్పబడింది.
ఈ రోజున బాల కృష్ణుని ఊయలలో వేసి
ఊపుతారు. అందుకే పండుగను కొన్ని ప్రాంతాల లో డోలోత్సవంగా జరుపుకుంటారు.
అయ్యప్ప పంబల రాజుకు కనపడింది కూడా ఈ రోజునే,
అంటే ఫాల్గుణ శుద్ధ పూర్ణిమనాడే అని అయ్యప్పకు పూజలు చేస్తారు.
అలాగే ఈ వేళ పెళ్లి కాని యువతీ యువకులు
తమకి తొందరగా పెళ్లి కావాలని రతీమన్మథులను పూజిస్తారు.
అదేవిధంగా పిల్లలకు ప్రాణహాని తలపెట్టే ఢుంఢి
అనే రాక్షసి పీడ విరగడ అయింది కూడా ఈ రోజునే, అందుకే ఈ రోజున తమ పిల్లలని చల్లగా
చూడాలని పరమేశ్వరుని పుజిస్తారు.
ఈ రోజున ఆచరించాల్సిన వేరే విధి విధానాలూ ఉన్నాయి, ఉదయాన్నే కట్టెలు, పిడకలు రాశిగా పోసి నిప్పును రాజేసి దానిపైకి హోళికా అనే శక్తిని అవహింపజేసి ‘శ్రీ హోళికాయైనమః’ అని పూజించి మూడు సార్లు అగ్నికి ప్రదక్షిణం చేస్తూ ...
‘వందితాసి సురేంద్రేణ బ్రాహ్మణా శంకరేణచ , అతస్త్వాం పాహినో దేవి భూతే భూతి ప్రదో భవ’
అనే శ్లోకం చదవాలని పెద్దలు చెబుతారు.
ఆ తర్వాతే రంగులను చల్లడం, రంగునీటితో ఉత్సవం జరుపుకోవడం చేయాలని శాస్త్త్ర వచనం. హోలీ పండుగ రోజున చెట్లేలకు పూసే లేత మావిచిగుళ్లు తింటే ఆ సంవత్సరమంతా మనం సంతోషంగా ఉంటామని శాస్త్రోక్తం.
No comments:
Post a Comment